
ఆంధ్రప్రదేశ్
కావలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
కావలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు.మాజీ ఎమ్మెల్యే కావలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి, దేశాభివృద్ధి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.