
అంతర్జాతీయ వార్తలు
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన ఐఏఎస్ అధికారి
చత్తీస్గఢ్, జూన్ 29 (టీజీ 24): చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయగడ్ జిల్లా 2022 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి పటారే అభిజిత్ బాబన్ సోమవారం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోకోస్ యాప్ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న ఈబీకేలను కలిసి వారితో ముచ్చటించిన ఆయన, గ్రామీణాభివృద్ధిలో వారు అందిస్తున్న సేవలను అభినందించారు. గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు ఈబీకేల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (DPM) అవిక్ బస్, ఈఎంటి ట్రైనర్లు రాజేశ్వర్ రెడ్డి, ఎండి వాహిద్ పాల్గొన్నారు. ఐఏఎస్ అధికారికి ఘన స్వాగతం పలికి, శిక్షణ కార్యక్రమం విశేషాలను వివరించారు.