TG24TV
రచయిత
యాదాద్రి దేవస్థాన బోర్డు సభ్యుడు, మహిళా కమిషన్ సభ్యులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
TG24TV
రచయిత
యాదాద్రి దేవస్థాన బోర్డు సభ్యుడు, మహిళా కమిషన్ సభ్యులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి, జూలై 18. (టీజీ 24): ఇటీవల యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బోర్డు సభ్యుడిగా నియమితులైన డాక్టర్ లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన నునవాత్ రాధా భాయ్, చిట్యాల శ్వేత, శంకరమ్మలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. యాదాద్రి దేవస్థాన అభివృద్ధికి, మహిళల హక్కుల పరిరక్షణకు వారు సమర్థవంతంగా సేవలందిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సన్మానం అందుకున్న వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.