TG24TV
రచయిత
మరపురాని మహానేత వైయస్ఆర్
TG24TV
రచయిత
మరపురాని మహానేత వైయస్ఆర్

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 08 (టీజీ 24): కగూడెం మండల కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్తో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను నాయకులు గుర్తు చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడోసారి నియమితులైన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్తో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవులకు నియమితులైన నాయకులను, ఇటీవల కాంగ్రెస్లో చేరిన కన్నాయిగూడెం సర్పంచ్ కల్తీ విజయ్ను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.