TG24TV
రచయిత
లులు ఆన్ సేల్ ను ప్రారంభించిన నటుడు నందు
TG24TV
రచయిత
లులు ఆన్ సేల్ ను ప్రారంభించిన నటుడు నందు

కూకట్పల్లి, లులు మాల్లో లులు ఆన్ సేల్’ ను నటుడు నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘లులు ఆన్ సేల్’ లోగోతో పాటు టీ-షర్ట్ను ఆవిష్కరించారు. జూలై 9 నుంచి 12 వరకు నిర్వహించే ఈ మెగా సేల్లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఫ్లాట్ 50 శాతం వరకు తగ్గింపు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, ఫుడ్ కోర్ట్తో పాటు మాల్లోని రిటైల్ స్టోర్లు ప్రత్యేక ఆఫర్లతో పాల్గొంటున్నాయని వెల్లడించారు. లులు హైపర్మార్కెట్లో 25 వేలకుపైగా ఉత్పత్తులపై ఫ్లాట్ 50 శాతం వరకు తగ్గింపు, ఫంతూరాలో 100 శాతం బోనస్ ఆఫర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. రూ.2,999 విలువైన షాపింగ్ చేసిన లులు హ్యాపీనెస్ సభ్యులకు లక్కీ డ్రా ద్వారా హ్యుందాయ్ i20 కారు గెలుచుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లులు మాల్ రీజినల్ మేనేజర్ మహ్మద్ షరీఫ్, మాల్ మేనేజర్ ఏజిల్ అరసన్, డీజీఎం విశాల్ కుమార్, ఫంతూరా అసిస్టెంట్ మేనేజర్ సూర్యకాంత్, మార్కెటింగ్ మేనేజర్లు ఫణి, మను ఆంథోనీ పాల్గొన్నారు.