లులు ఆన్ సేల్ ను ప్రారంభించిన నటుడు నందు

లులు ఆన్ సేల్ ను ప్రారంభించిన నటుడు నందు

కూకట్‌పల్లి, లులు మాల్‌లో లులు ఆన్ సేల్’ ను నటుడు నందు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘లులు ఆన్ సేల్’ లోగోతో పాటు టీ-షర్ట్‌ను ఆవిష్కరించారు. జూలై 9 నుంచి 12 వరకు నిర్వహించే ఈ మెగా సేల్‌లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఫ్లాట్ 50 శాతం వరకు తగ్గింపు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 200కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, ఫుడ్ కోర్ట్‌తో పాటు మాల్‌లోని రిటైల్ స్టోర్లు ప్రత్యేక ఆఫర్లతో పాల్గొంటున్నాయని వెల్లడించారు. లులు హైపర్‌మార్కెట్‌లో 25 వేలకుపైగా ఉత్పత్తులపై ఫ్లాట్ 50 శాతం వరకు తగ్గింపు, ఫంతూరాలో 100 శాతం బోనస్ ఆఫర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. రూ.2,999 విలువైన షాపింగ్ చేసిన లులు హ్యాపీనెస్ సభ్యులకు లక్కీ డ్రా ద్వారా హ్యుందాయ్ i20 కారు గెలుచుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లులు మాల్ రీజినల్ మేనేజర్ మహ్మద్ షరీఫ్, మాల్ మేనేజర్ ఏజిల్ అరసన్, డీజీఎం విశాల్ కుమార్, ఫంతూరా అసిస్టెంట్ మేనేజర్ సూర్యకాంత్, మార్కెటింగ్ మేనేజర్లు ఫణి, మను ఆంథోనీ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

మేడ్చల్‌లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పిలుపునిచ్చారు. బోడుప్పల్‌లో జరిగిన సమావేశంలో నూతన జిల్లా కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

సీసీ రోడ్లు మంజూరు చేయండి... విజయేందర్ రెడ్డి

సీసీ రోడ్లు మంజూరు చేయండి... విజయేందర్ రెడ్డి

ఉప్పల్‌లోని రామంతపూర్ భగాయత్ పరిధి వెంకటసాయి నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని తక్షణమే మంజూరు చేయాలని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు విజయేందర్ రెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో తాగునీరు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, ఇప్పుడు సీసీ రోడ్లు అత్యవసరమని ఆయన వివరించారు. వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుని సీసీ రోడ్ల మంజూరుకు కృషి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.