T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ములుగు జిల్లా కార్యదర్శి గా షేక్ అక్బర్ పాషా నియామకం

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ములుగు జిల్లా కార్యదర్శి గా షేక్ అక్బర్ పాషా నియామకం

సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ములుగు జిల్లా కార్యదర్శి గా షేక్ అక్బర్ పాషా నియామకం

సమాచార హక్కు చట్ట పరిరక్షణ సంస్థ ములుగు జిల్లా కార్యదర్శిగా షేక్ అక్బర్ పాషా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగండ్ల వెంకటేష్ నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అక్బర్ పాషా మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపడతానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ బలోపేతానికి నిబద్ధతతో పనిచేస్తానన్నారు. ఆయన నియామకంపై కమిటీ నాయకులు, సభ్యులు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్‌లు

telangana