T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
SIR పై అప్రమత్తంగా ఉండాలి-ఎమ్మెల్యే జీఎంఆర్
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
SIR పై అప్రమత్తంగా ఉండాలి-ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్చెరు, జూలై 6 (టీజీ 24): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటు కీలకమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్పై ఓటర్లకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం, బూత్ లెవెల్ అధికారులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి అర్హుడి ఓటు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్షిప్పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 12న పటాన్చెరులో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.