TG24TV
రచయిత
చెన్నూరులో దయన్న బర్త్డే వేడుకలు.. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ
TG24TV
రచయిత
చెన్నూరులో దయన్న బర్త్డే వేడుకలు.. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ

పాలకుర్తి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదినం సందర్భంగా చెన్నూరు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తన జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా కష్టపడి ముందుకు సాగాలని సూచించారు. దయన్న జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన ICON GRAPHICS ప్రతినిధులు పూస్కూరి సోమేశ్వర్ రావు, సురేష్ రావులను అభినందించారు. వారు మాట్లాడుతూ, "విద్యార్థులే దేశ భవిష్యత్తు.. వారి విద్యాభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది" అని తెలిపారు.