T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

గోత్తికోయల సమస్యలపై ఫారెస్ట్ అధికారులతో చర్చ

గోత్తికోయల సమస్యలపై ఫారెస్ట్ అధికారులతో చర్చ

గోత్తికోయల సమస్యలపై ఫారెస్ట్ అధికారులతో చర్చ

తాడ్వాయి, ఆగస్టు 13 (టీజీ 24) గోత్తికోయలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు కోరారు. తాడ్వాయి రేంజర్ రమేష్, DRO కృష్ణవేణిలను చిటమట రఘు మర్యాదపూర్వకంగా కలిసి గోత్తికోయల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా గోత్తికోయలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గోత్తికోయల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చిటమట రఘు తెలిపారు. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల వినయ్, PACS డైరెక్టర్ వంగపండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

warangal