TG24TV
రచయిత
పెసరు రమేష్కు ఘన సన్మానం
TG24TV
రచయిత
పెసరు రమేష్కు ఘన సన్మానం

పెసరు రమేష్కు ఘన సన్మానం -ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పెసరు రమేష్. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన పెసరు.రమేష్కు మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్స్లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అభిమానులు పాల్గొని శాలువా కప్పి,పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెసరు.రమేష్ మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలిచి, ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.