T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాట్రపల్లిలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కాట్రపల్లిలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రాయపర్తి, జూలై 08 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కాట్రపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన మౌలిక వసతులు, స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.