T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బాధాకరం - చాడ మరియ సురేఖ

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బాధాకరం - చాడ మరియ సురేఖ

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బాధాకరం -  చాడ మరియ సురేఖ

వర్ధన్నపేట, జులై 31 (టీజీ 24): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి చాడ మరియా సురేఖ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాన్య కుటుంబం నుంచి ఎదిగి ప్రజల ఆదరణతో ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రజాసేవనే లక్ష్యంగా నిరంతరం పనిచేసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి, వరంగల్ జిల్లా రాజకీయాలకు, తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన ఆయన మరణం నర్సంపేట నియోజకవర్గానికే కాకుండా వరంగల్ జిల్లా రాజకీయాలకు తీరని లోటని ఆమె అన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.