T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద నిరుద్యోగుల ఆందోళన

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద నిరుద్యోగుల ఆందోళన

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద నిరుద్యోగుల ఆందోళన

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్‌లో కేవలం 5,000 పోస్టులు మాత్రమే ప్రకటించడంపై నిరుద్యోగులు సోమవారం హైదరాబాద్‌లోని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పోస్టుల సంఖ్యను 5,000 నుంచి 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు నినాదాలు చేశారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. పోస్టుల సంఖ్యను పెంచి ఎక్కువ మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అయితే, ఆందోళన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు, చట్టం, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

Agritelanganahyderabad